CM Chandrababu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు

Read Time:  1 min
CM Chandrababu Naidu to Tirumala with family today
CM Chandrababu Naidu to Tirumala with family today
FONT SIZE
GET APP

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు

ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షలు

దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా నారా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు మొత్తం అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందజేస్తోంది.

ఉగాది పండగను అత్యంత వైభవంగా

కాగా, ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.