యాదవ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు

Read Time:  1 min
CM Chandrababu Naidu attend
CM Chandrababu Naidu attend
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి లోక్ సభ స్థానం టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి తూకివాకం సమీపంలోని ఆర్.పీ.ఆర్. కల్యాణ మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబును ఘనంగా ఆహ్వానించారు.

chandrababu attends a weddi

చంద్రబాబును చూసిన వధూవరులు ఆనందం

వివాహ వేడుకలో చంద్రబాబును చూసిన వధూవరులు ఆనందం వ్యక్తం చేశారు. వారు ఆయన కాళ్లకు నమస్కరించగా, చంద్రబాబు వారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందించి, వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరారు. అనంతరం వధూవరులతో కలిసి ఫొటోలు దిగారు.

ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. వివాహ వేడుక ఘనంగా జరిగిందని, ముఖ్యమంత్రి హాజరవడం సంతోషకరమని కుటుంబ సభ్యులు, అతిథులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రశంసించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.