📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

CBN: నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!

Author Icon By Radha
Updated: December 27, 2025 • 1:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సీఎం చంద్రబాబు నాయుడు(CBN) స్పష్టం చేశారు. నేరాలు, రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి నేరాలను ముందుగానే అరికట్టాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలని, విజువల్ ఆధారాలతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు, సెటిల్‌మెంట్లు, రౌడీయిజానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ వంటి నిర్ణయాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Modi meets President Murmu : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

CM Chandrababu gives a mass warning to criminals.. Check with technology!

తిరుపతిలో భక్తుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం

తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, నిందితులపై పీడీ యాక్టులు ప్రయోగించడంలో చూపుతున్న చొరవను కొనియాడారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు, భవిష్యత్ దిశ

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు() విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడే సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల ఉనికి కనిపిస్తూ, మరోవైపు నేరస్తులకు తెలియకుండా గట్టి నిఘా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపే సంస్కృతి తమదేనని మరోసారి గుర్తుచేశారు.

సీఎం చంద్రబాబు ప్రధానంగా ఏ అంశంపై దృష్టి పెట్టారు?
నేరాలు, రౌడీయిజం, అక్రమ కార్యకలాపాల నియంత్రణపై.

నేర నియంత్రణకు ఏ పద్ధతులు సూచించారు?
సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీ వినియోగం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Andhra Pradesh CCTV Chandrababu Naidu Crime Control drones Law and order Police Technology Tirupati Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.