ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
Read Also: Vizag : నేడు విశాఖలో 9 IT సంస్థల క్యాంపస్ లకు భూమిపూజ
అధికారులు సహాయక చర్యలను ముమ్మరం
సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించామని,
వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: