📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Latest News: CM Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేల గైర్హాజరుపై సిఎం సీరియస్

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై.. కొద్దిసేపు సభలో ఉండి.. ఆ వెంటనే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి.. వారిపై సీరియస్ అయ్యారు.

గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి.. సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. విషయాన్ని సిఎం చంద్రబాబు గమనించి.. ఎమ్మెల్యేల హాజరుపై చీఫ్ వీప్ జివి ఆంజనేయులును ఆరా తీశారు. ఆయన వెంటనే అసెంబ్లీ (Assembly) లోని వీప్లను అప్రమత్తం చేశారు.

 AU student death : వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

CM Chandrababu

హాజరుకాని ఎమ్మెల్యేలకు సైతం విప్లు

దీంతో అప్పటికప్పుడు అసెంబ్లీకి హాజరుకావాలంటూ సుమారు 15 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు సైతం విప్లు (Whip) ఫోన్లు చేసి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రజా సమస్యలు.. రాష్ట్రాభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక అని సిఎం చంద్రబాబు నాయుడు నమ్ముతారు. అందుకే ఆయన ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరువుతారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటూ వైఎస్సార్సీపి అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే లకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటిది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly assembly proceedings Breaking News chandrababu dissatisfaction CM Chandrababu naidu latest news MLA Attendance Monsoon Session Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.