ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఈరోజు (జూన్ 12) విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం(Air India Boeing Dreamliner aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే.ఈ విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అధికారిక ప్రకటన
ఈ సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ప్రజలకు అండగా ఉండాలన్న భావనతో ఆయన తన అధికారిక పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖపట్నం పర్యటనలోప్రజలతో ముఖాముఖి సమావేశం కూడా ఏర్పాటైంది. కానీ ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు.

పాల్గొనాల్సి
అయితే,ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన ‘న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్షాప్'(New and Renewable Energy Regional Workshop)లో ఆయన పాల్గొనాల్సి ఉంది.దీంతో పాటు, కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.
Read Also: Krishnam Raju : కృష్ణంరాజులో పశ్చాత్తాపం లేదన్న పోలీసులు