📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ

Author Icon By Pooja
Updated: November 8, 2025 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Chandra babu) ప్రజలతో భేటీ అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం మాట్లాడుతూ ప్రజల అవసరాలు, అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read Also: Drugs: గంజాయ్ మత్తులో బస్సును ధ్వంసం చేసిన యువకులు

CM Chandra babu

పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలతో సమీక్ష

ప్రజల వినతులు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబు( CM Chandra babu) పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకంపై చర్చిస్తూ, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా నాయకత్వ నియామకాలు జరగాలని సూచించారు. పార్టీ విస్తరణ, గ్రామ స్థాయి బలోపేతం, వచ్చే ఎన్నికల వ్యూహం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు మార్పిడి చేశారు.

కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి వేడుకల్లో మంత్రి లోకేశ్

ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా కనకదాసు సమాజ చైతన్యానికి చేసిన కృషిని ఆయన స్మరించారు. ఆయన భావాలు ఈ రోజుకీ సమాజాన్ని స్ఫూర్తి పరుస్తున్నాయని లోకేశ్ తెలిపారు. అదనంగా, ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి “ఆదరణ పథకం” కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పేదలకు వివిధ రకాల పనిముట్లు పంపిణీ చేశారు.

లోకేశ్ మాట్లాడుతూ కనకదాసు చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Amaravati Kanakadasa Jayanthi Latest News in Telugu Nara Lokesh TDP Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.