(CII summit 2025) లో, సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఫుట్వేర్ తయారీ సంస్థ Hwaseung Corporation ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోని అగ్రగామి స్పోర్ట్స్ బ్రాండ్లైన Nike, Adidas, Puma వంటి కంపెనీలకు షూలను తయారు చేసే ఈ సంస్థ, ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తమ కొత్త ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్రానికి పెద్ద అవకాశంగా మారింది.
Read Also: AP: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ..

కుప్పంలో సంవత్సరానికి 20 మిలియన్ జతల ఉత్పత్తి లక్ష్యం
తాజా వివరాల ప్రకారం, Hwaseung కంపెనీ $150 మిలియన్ల (సుమారు ₹1,200 కోట్లు) పెట్టుబడిని కుప్పంలో పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తివగానే, కుప్పం ప్రాంతం దక్షిణ భారతదేశంలో కొత్త నాన్-లెదర్ స్పోర్ట్స్ షూ తయారీ హబ్గా ఆవిర్భవించనుంది.
కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడు (TamilNadu) తో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: