📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest News: CII Conference 2025: రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Author Icon By Anusha
Updated: November 15, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Conference 2025) రాష్ట్ర అభివృద్ధికి మరొకసారి కీలక వేదికగా నిలుస్తోంది. ఈ సదస్సులో రెండో రోజు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ గ్రూప్ (Raymond Group) చేపట్టనున్న మూడు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Read Also: Vijayanagaram:కాకి తీసిన దీపంతో అగ్నిప్రమాదం:నాలుగు ఇళ్లు బూడిద

6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు

రూ.1201 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు.

రేమాండ్ గ్రూప్.. రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో పాటు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. సీఎం సమక్షంలో శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో పాటు మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Investments Chandrababu Naidu cii partnership summit latest news Raymond Group projects Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.