Thirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ  విచారణ

Read Time:  1 min
Thirumala
Thirumala
FONT SIZE
GET APP

సీఐడీ ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు ప్రారంభించేది

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసును గౌరవహైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం విచారించడం ప్రారంభించింది. సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం తిరుమలకు చేరుకుని ప్రాంగణం పరిశీలించడం ప్రారంభించింది. కేసు నమోదు అయిన తిరుమల(Thirumala) వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డులు, సాక్ష్యాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read also: మీరు చాలా అందంగా ఉన్నారు: ట్రంప్ సరదా కామెంట్

Thirumala

చోరీ ఘటనలో టీటీడీ ఉద్యోగి నిందితుడు, పూర్తి విచారణ ఆదేశాలు

మార్చి 2023లో పరకామణిలో 920 అమెరికన్ డాలర్ల చోరీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో టీటీడీ (TTD) ఉద్యోగి రవికుమార్ నిందితుడిగా గుర్తించబడ్డాడు. కేసును లోక్ అదాలత్ ద్వారా మూసివేసినట్లు హైకోర్టు పిటిషన్‌లో వెల్లడైంది. హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి, నిజాలను వెలికితీసేందుకు సీఐడీకి దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ(Thirumala) బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి సీఐడీకి ఆధారాలను సమర్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.