ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన ఫైబర్నెట్ కేసు అధికారికంగా మూసివేయబడింది. జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ఫైబర్నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు నిర్దారించలేకపోవడంతో, చంద్రబాబుతో పాటు మరో 15 మందిపై ఉన్న ఆరోపణలు రద్దయ్యాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఆధారాలు లేవని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో కేసు మూసివేయడాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించింది.
Read also: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్
huge relief for Chandrababu Naidu.. CID case registered
కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట
సీఐడీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ భారత్నెట్ పథకం కింద వచ్చిన నిధుల్లో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్కు బదిలీ చేశారన్న ఆరోపణలు సాక్ష్యాలతో నిరూపించబడలేదు. ఫైబర్నెట్ ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీనిపై ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మతో పాటు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా కోర్టులో హాజరై నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.
దీంతో ఈ కేసు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టినదని, వాస్తవ ఆధారాలు లేనివని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించగా, దర్యాప్తు సంస్థ కూడ తమ ఫైనల్ రిపోర్ట్ ద్వారా ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: