हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..

Rajitha
News Telugu: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన ఫైబర్‌నెట్ కేసు అధికారికంగా మూసివేయబడింది. జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు నిర్దారించలేకపోవడంతో, చంద్రబాబుతో పాటు మరో 15 మందిపై ఉన్న ఆరోపణలు రద్దయ్యాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఆధారాలు లేవని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో కేసు మూసివేయడాన్ని ఏసీబీ కోర్టు అంగీకరించింది.

Read also: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌

Chandrababu Naidu

huge relief for Chandrababu Naidu.. CID case registered

కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట

సీఐడీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ భారత్‌నెట్ పథకం కింద వచ్చిన నిధుల్లో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదిలీ చేశారన్న ఆరోపణలు సాక్ష్యాలతో నిరూపించబడలేదు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీనిపై ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మతో పాటు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా కోర్టులో హాజరై నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.

దీంతో ఈ కేసు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టినదని, వాస్తవ ఆధారాలు లేనివని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేసు మూసివేతతో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించగా, దర్యాప్తు సంస్థ కూడ తమ ఫైనల్ రిపోర్ట్ ద్వారా ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870