📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Chittoor: గుడికి వెళ్ళి వస్తానని వెళ్లి నదిలో శవమై తేలింది

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు : చిత్తూరు టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 2వ తేదీ అదృశ్యమైన మహిళ బుధవారం (Chittoor) చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల పరిధిలోనీ నీవా నదిలో మృతదేహమై తేలింది. చిత్తూరు గిరింపేటలో నివాసం వుంటున్న కవిత(38) డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి గుడికి వెళ్ళి వస్తానని బయలుదేరి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ మేరకు కవిత సోదరుడు ఎస్.కిరణ్(34) జనవరి 2వ తేదీ రాత్రి 9 గంటలకు టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుడికి వెళ్ళి వస్తానని చెప్పిన కవిత తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆమె సమాధానం ఇవ్వడం లేదని, అనంతరం తాను వికలాంగుల సంఘ అధ్యక్షుడైన మురళీ ఇంటికి వెళ్ళి తన సోదరి గురించి వివరాలు అడిగానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read also: AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి

వాయిస్ మెయిల్ ఆధారంగా హత్య అనుమానాలు

అప్పుడు మురళీ చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అడిగారని అందుకు చంద్రశేఖర్ తనకు కవిత ఒక వాయిస్ మెయిల్ పంపిందని చెప్పాడు. (Chittoor) ఆ మెసేజ్లో గణేష్ అనే వ్యక్తి తనను పెళ్ళి చేసుకున్నాడని, అతను తనని తనతో పాటు తీసుకెళ్తున్నాడని సైతం కవిత వాయిస్ మెయిల్లో పేర్కొంది. ఆపై కిరణ్ కవిత కోసం చిత్తూరు నగరం మొత్తం గాలించగా రాఘవ ధియేటర్కు సమీపంలో కవిత స్కూటర్ పార్క్చేసి కన్పించింది. అక్కడ వున్న వారిని కిరణ్ ప్రశ్నించగా స్కూటర్ పార్క్ చేసి మహిళ ఆటో ఎక్కి వెళ్ళిందని సమాచారం ఇచ్చారు. అలా వెళ్ళిన మహిళ గంగాధరనెల్లూరులోని నీవా నది బ్రిడ్జి కింద మృతదేహమై తేలింది. కవిత ఇచ్చిన వాయిస్ మెయిల్ మేరకు పెళ్ళి చేసుకున్న గణేష్ కవితను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు సైతం గణేష్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు గణేష్ పట్టుబడితే కాని వాస్తవాలు తెలిసే అవకాశాలు వున్నారు. ఈ మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:




Chittoor Latest News in Telugu MissingCase PoliceInvestigation RiverBody SuspiciousDeath Telugu News WomanFoundDead

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.