📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News telugu: Chittoor-మామిడి రైతులకు రూ.480 కోట్లు బకాయిపడ్డ పల్ప్ ఫ్యాక్టరీలు

Author Icon By Sharanya
Updated: September 25, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు: మామిడి రైతులు పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు కావస్తుంది. అయితే పల్ప్ ఫ్యాక్టరీల నుండి మామిడి రైతుకు ఇప్పటి వరకు చిల్లిగవ్వ రాలేదు. మామిడి సీజన్లో ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసిన రైతులు ఫ్యాక్టరీలు చెల్లించే డబ్బులపై ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు మాత్రం మామిడి రైతును కనికరించడం లేదు. ఈ మేరకు జిల్లాలో మామిడి రైతులు ఫ్యాక్టరీల నుండి తమకు రావాల్సిన బకాయిలు వసూలు చేయడానికి మరోసారి ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు.

మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు

జిల్లాలో మామిడి సీజన్లో మే, జూన్, జులై నెలల్లో 35 వేల మంది మామిడి రైతులు 4 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని పల్ప్ ఫ్యాక్టరీలకు తరలించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ సీజన్లో మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకుంది. కలెక్టర్ సుమిత్కుమార్(Sumit Kumar), ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో చర్చించి మామిడి రైతుకు ఒక కేజీపై రూ.4 ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా, పల్ప్ ఫ్యాక్టరీలు ఒక కేజీ మామిడిపై రైతుకు రూ.8 చెల్లిచేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సీజన్ లో మామిడి రైతుకు ఒక కేజీ పై రూ.12 లభిస్తుందని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మొత్తం ఆశించిన మేరకు రైతుకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ మేరకుపల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపులకు మామిడి రైతులు సీజన్లో 3 నెలల పాటు 4 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు తోతాపురి మామిడి(Totapuri mango)ని సరఫరా చేశారు. అయితే ప్రభుత్వం రైతుకు కేజీ తోతాపురి మామిడిపై చెల్లిస్తామని చెప్పిన రూ.4 ఇప్పటి వరకు చెల్లించలేదు. అలాగే పల్ప్ ఫ్యాక్టరీలు సీజన్లో కేజీ తోతాపురిపై రూ.8 చెల్లిస్తామని చెప్పినప్పటికీ అత్యధిక పల్ప్ ఫ్యాక్టరీలు రైతుకు ఒక కేజీ తోతాపురి మామిడిపై రూ.4 నుండి రూ.5 వరకు మాత్రమే చెల్లించడానికి సుముఖంగా వున్నాయి. మిగిలిన మొత్తం చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని ఇప్పటికే పలు పల్ప్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలకు మామిడి కాయలు సరఫరా చేసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఫ్యాక్టరీల నుండి ఒక్క పైసా చెల్లింపులు జరుగపోవడంపై మామిడి రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Agriculture Crisis Andhra Pradesh farmers Breaking News Chittoor Farmer dues latest news Mango farmers Pulp Factories Telugu News ₹480 Crores

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.