📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

News Telugu: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Author Icon By Rajitha
Updated: December 10, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chittoor Accident: పుత్తూరు (నగరి) : చిత్తూరు జిల్లా (chittoor district) నగరి మండలం వికెఆర్ పురం సమీపం జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేసే సంతానం(39), శంకర్ సుబ్రమణి(50), చెన్నై మేడంబాకంకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అరుణ్కుమార్ (40) మృతి చెందారు. తమల్ సెల్వి (36), మదన్(40), యశ్వంత్ (11) అనే వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు… తిరుచానూరులో నివాసం ఉన్న సంతానం, శంకర్ సుబ్రమణి పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేస్తున్నారు.

Read also: Purvodaya Projects: ₹40 వేల కోట్లతో ‘పూర్వోదయ’ ప్రాజెక్టులు: AP అభివృద్ధికి CBN భారీ ప్లాన్

serious road accident in Chittoor district

వికెఆర్ పురం వద్ద ఎదురెదురుగా ఢీకొనడం

Chittoor Accident: ప్రతి మంగళవారం తిరుత్తణికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఇలా వారు తిరుత్తణికి కారులో బయలుదేరగా చెన్నైకి చెందిన అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కారులో బయలుదేరారు. ఈ రెండు కార్లు వికెఆర్ పురం వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించి ఉన్నత వైద్యసేవల నిమిత్తం చెన్నై తాంబరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ తుషారూడీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP News Car Collision Chittoor Road Accident latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.