Chittoor Accident: పుత్తూరు (నగరి) : చిత్తూరు జిల్లా (chittoor district) నగరి మండలం వికెఆర్ పురం సమీపం జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేసే సంతానం(39), శంకర్ సుబ్రమణి(50), చెన్నై మేడంబాకంకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అరుణ్కుమార్ (40) మృతి చెందారు. తమల్ సెల్వి (36), మదన్(40), యశ్వంత్ (11) అనే వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు… తిరుచానూరులో నివాసం ఉన్న సంతానం, శంకర్ సుబ్రమణి పద్మావతి అమ్మవారి ఆలయ పోటులో పనిచేస్తున్నారు.

serious road accident in Chittoor district
వికెఆర్ పురం వద్ద ఎదురెదురుగా ఢీకొనడం
Chittoor Accident: ప్రతి మంగళవారం తిరుత్తణికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఇలా వారు తిరుత్తణికి కారులో బయలుదేరగా చెన్నైకి చెందిన అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కారులో బయలుదేరారు. ఈ రెండు కార్లు వికెఆర్ పురం వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించి ఉన్నత వైద్యసేవల నిమిత్తం చెన్నై తాంబరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ తుషారూడీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: