📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

మిర్చి రైతులకి మేలు చేయాలి : సీఎం చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని అన్నారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరముంది. మిర్చి రైతులను ఆదుకోవాలి, వారికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చామన్నారు.

ఈ ఏడాది అనూహ్యంగా పడిపోయిన మిర్చి ధరలు

సాగు ఖర్చులను రియలిస్టిక్‌గా లెక్కలు

మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఏపీలోని కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ తీసుకోకుండా.. ధర నిర్ణయించే పరిస్థితికొచ్చారు. సాగు ఖర్చులను రియలిస్టిక్‌గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరాం. శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత.. దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

కొత్తగా డీపీఆర్‌ రూపొందించి జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు

కేంద్రం మంత్రి సీఆర్‌ పాటిల్‌తో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించాం. 2027లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు గురించి కూడా చర్చించాం. వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదు. ఇంటింటికీ నల్లా ద్వారా నీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మేం కొత్తగా డీపీఆర్‌ రూపొందించి జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు వినియోగించుకుంటాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటామన్నారు.

మిర్చి రైతులకు కేంద్రం సహాయం అందించాలి

రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితిని కేంద్రానికి పూర్తిగా వివరించామని, మిర్చి ఎగుమతులను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రైతులకు తగిన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌ కింద మద్దతు మెరుగుపరిచే విధంగా నిబంధనలు సవరించాలని సూచించారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని గంభీరంగా తీసుకొని త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సీఎం వెల్లడించారు.

Breaking News in Telugu Chilli farmers CM chandrababu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.