ఢిల్లీ పర్యటలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Read Time:  1 min
Chief Minister Chandrababu on Delhi tour
Chief Minister Chandrababu on Delhi tour
FONT SIZE
GET APP

అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇవ్వబోతున్న రుణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం. అలాగే గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు(శనివారం) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు.

నేడు మధ్యాహ్నం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. ఈ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు థానే, భివండీ ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రేపు(ఆదివారం) సియోన్ కొలివాడ, వర్లీ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.