📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

CM Chandrababu : నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన

Author Icon By Sudheer
Updated: May 17, 2025 • 8:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ (మే 17) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఉదయం నుంచి పలు కార్యకలాపాల్లో పాల్గొంటారు. సి. క్యాంపు రైతు బజారులో సీఎం రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సామాన్య ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంగా ఇది విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

స్వచ్ఛాంధ్ర పార్క్కు శంకుస్థాపన

అనంతరం జైరాజ్ స్టీల్ సంస్థ నిర్మించబోయే స్వచ్ఛాంధ్ర పార్క్ (Swachhandra Park)శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, అక్కడి నుంచి పీ4 కార్యక్రమంలో పాల్గొంటారు. పీ4 కార్యక్రమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం ప్రజావేదిక వద్ద సభలో ప్రసంగించి, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

టీడీపీ నేతలతో సమావేశం

మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:35 వరకు టీడీపీ నేతలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్న సీఎం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. సాయంత్రం 5:35కి కర్నూలు ఎయిర్‌పోర్ట్ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.

Read Also : Operation Sindoor : విదేశాలకు ఎంపీల బృందాలు!

Chandrababu karnool

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.