Banakacherla Project : బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Read Time:  1 min
Banakacherla Project : బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్ట్‌పై (On the Banakacharla project) స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని, కేవలం వరద జలాలను వినియోగిస్తున్నామని తెలిపారు. గోదావరిలో లభ్యమయ్యే నీటిని వేరే బేసిన్‌కు తరలించడంలో తప్పేంటని ప్రశ్నించారు.చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. గోదావరి నుంచి రెండు రాష్ట్రాలూ నీటిని తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్ విభజన చట్టంలో భాగంగా చేపట్టామని తెలిపారు. అదే తరహాలో ఈ ప్రాజెక్టు కూడా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో, గొడవలు పనికిరావని అన్నారు.

తెలంగాణతో ఎప్పుడూ విభేదం లేదు

తెలంగాణతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, అని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలందరికీ మేలు జరగాలనేదే నా లక్ష్యం, అని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఏపీ ముఖ్య పాత్ర పోషించిందని గుర్తు చేశారు. “నాకు తెలంగాణను నష్టపెట్టాలనే ఆలోచన ఎప్పుడూ లేదు, అని స్పష్టం చేశారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ప్రజల మద్దతు

“మేము ప్రజలకు ఇచ్చిన హామీ డబుల్ ఇంజిన్ సర్కార్,” అని చంద్రబాబు అన్నారు. కేంద్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే తమ లక్ష్యమన్నారు. గొడవలకు కాదు.. అభివృద్ధికి మద్దతు ఇస్తాం, అన్నారు.

తెలంగాణ ఆగ్రహం: కేంద్రానికి ఫిర్యాదు

మరోవైపు, బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుళ పార్టీ ఎంపీలతో సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు.

Read Also : Tony Blair : టోనీ బ్లెయిర్ సంస్థతో తెలంగాణ ఒప్పందం

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.