📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

Author Icon By sumalatha chinthakayala
Updated: December 31, 2024 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి చంద్రబాబు దర్శించుకోనున్నారు. పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు..ఏపీలో ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.

CM chandrababu Palnadu district pension distribution program TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.