📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu : ఎల్లుండి సింగపూర్ కు సీఎం చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: July 24, 2025 • 11:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఈ నెల 26వ తేదీన సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలనే ప్రధాన లక్ష్యంతో సీఎం పర్యటించనున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే దిశగా ఆయన కసితో ముందుకు సాగుతున్నారు.

విదేశీ సంస్థలతో భేటీలు – పెట్టుబడులపై దృష్టి

సింగపూర్ పర్యటనలో చంద్రబాబు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, విద్య, హెల్త్‌కేర్, టూరిజం రంగాల్లో పెట్టుబడుల కోసం ఈ సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళికపై చర్చించనున్నట్టు సమాచారం.

ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ

సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన తమ ఆలోచనలు, సూచనలు తెలిపేందుకు ప్రవాసాంధ్రులకు ఈ సమావేశం వేదికగా మారనుంది. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, మంత్రులు టీజీ భరత్ తదితరులు ఉన్నతాధికారులతో కలిసి పాల్గొననున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి బలమైన బాటలు వేసే అవకాశంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also : AP : కొత్తగా 2వేల కి.మీ. రోడ్ల నిర్మాణం – సీఎం చంద్రబాబు

Chandrababu Google News in Telugu singapore

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.