ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దం మొత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అని ఆయన పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (NDA) విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
Read Also: LIC: అదానీ దుర్వినియోగం పై కాంగ్రెస్ ఘాటు వాక్యాలు

NDA అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న చంద్రబాబు
చంద్రబాబు నాయుడు(Chandrababu) మాట్లాడుతూ, బిహార్ ఎన్నికల్లో NDA అభ్యర్థుల విజయానికి తాను ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలను శక్తివంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం తెచ్చిన పథకాలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని చంద్రబాబు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
PTI ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
PTIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు, NDA ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ భవిష్యత్తును బలోపేతం చేస్తున్నాయని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై కొత్త శక్తిగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దం మొత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అని ఆయన పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: