Drugs Case CM Comments: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ ముఠాకజగంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందానికి (SIT) అప్పగించడంతో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో జరిగిన ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించడం ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచింది.
Read Also: AP LPG Gas Update: గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!
సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన యువకుడని అవకాశమిస్తే, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, విలువల పట్ల రాజీ పడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వారిని మోయాలా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పోలీసులపై కాల్పులు మరియు డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ ఫామ్హౌస్పై జరిగిన దాడుల సమయంలో పోలీసులపై కాల్పులు జరగడం ఈ కేసు తీవ్రతను పెంచింది. డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే, సాధారణంగా ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ కోసం డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తారు, కానీ ఎంపీ అందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ ఆరోపణలను పుట్టా మహేష్ ఖండిస్తూ వీడియోలు విడుదల చేస్తుండగా, ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు స్పందిస్తూ.. సిట్ విచారణలో అన్ని నిజాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: