📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Chandrababu: నష్టపోయిన వరద భాదితులకి రూ.10వేలు సాయం

Author Icon By Tejaswini Y
Updated: November 10, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయలచెరువుకు గండిపడడంతో భారీ వరద ముంచెత్తింది. చెరువు నీరు పొంగిపొర్లడంతో ఐదు గ్రామాలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి సీఎం చంద్రబాబు(Chandrababu) ఆదేశాలతో అధికారులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు.

సహాయక చర్యల్లో 600 మంది సిబ్బంది

కళత్తూరు గ్రామంలో పారిశుద్ధ్య పనులు, బురద తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చర్యల్లో 600 మంది సిబ్బంది, 5 అగ్నిమాపక వాహనాలు, అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల నుంచి వచ్చిన 350 పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి ఐదుగురు సిబ్బందిని కేటాయించి, అడుగున్నర మేర పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు.

Read Also: Montha Effect: ఏపీలో 1.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం

విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా

Chandrababu: వరద వల్ల 100 విద్యుత్ స్తంభాలు, 50 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది ఇప్పటికే 90 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో తడి ఇళ్లు ఉండటంతో విద్యుత్ సరఫరా మరో రెండు రోజుల తర్వాత పూర్తిగా పునరుద్ధరించనున్నారు.

బాధితులకు ఆర్థిక సాయం, పునరావాసం

తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. స్థానిక పాఠశాలలో పునరావాసం కల్పించి ఆహారం అందించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల సాయం, తక్షణ సాయంగా రూ.3 వేల నగదు అందజేశారు. పశువులను కోల్పోయిన వారికి మేక, గొర్రెకు రూ.7,500, ఆవుకు రూ.40 వేల, గేదెకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

స్వయం ఉపాధికి చేయూత

ప్రభుత్వం బాధిత గ్రామాల్లో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేందుకు చేయూత అందించనుంది. ఈ చర్యలతో గ్రామాల్లో సాధారణ జీవనాన్ని త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshNews APGovernment CMChandrababu Rayalacheruvu ReliefOperations TirupatiDistrict TirupatiFloods

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.