ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu), మంత్రుల బృందం ప్రస్తుతం సింగపూర్ పర్యటన (Singapore trip) లో ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యం. రెండో రోజు ముఖ్యమైన సమావేశాలతో వారి షెడ్యూల్ నిండి ఉంది.భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి టాన్ సీ లెంగ్ను చంద్రబాబు కలుస్తారు. ఈ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక సహకారం అంశాలు చర్చకు వస్తాయి.ఉదయం 8.30 గంటలకు ఎయిర్బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితో సమావేశమవుతారు. అనంతరం ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులను కలుస్తారు.
బిజినెస్ రౌండ్ టేబుల్ చర్చ
ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. “నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మార్పు: కార్మిక శక్తిని వేగవంతం చేయడం” అనే అంశంపై చర్చించనున్నారు. ఇందులో సింగపూర్లోని ప్రముఖ యూనివర్శిటీల విద్యార్థులు పాల్గొంటారు.ఉదయం 11 గంటలకు ఎవర్వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్తో చంద్రబాబు భేటీ అవుతారు.
అనంతరం 11.30 గంటలకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం అనుసంధాన ప్రణాళికలను పరిశీలిస్తారు.మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్ను సందర్శిస్తారు. ఇక్కడ పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, ఎగుమతి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది.
సాయంత్రం కీలక కార్యక్రమాలు
సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రప్రదేశ్-సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ప్రసంగిస్తారు.సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై ఇరువురూ చర్చిస్తారు.
Read Also : Jharkhand : ఝార్ఖండ్ అటవీప్రాంతంలో బయటపడిన నగదు!