📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

Author Icon By Sharanya
Updated: June 29, 2025 • 10:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన ఏడాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) భారీ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జూలై 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కూటమి భాగస్వామ్య నాయకులు “ఇంటింటి ప్రచారం” నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతుండగా, కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యే నేతలు

ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరుకానున్నారు. దాదాపు నెల రోజుల పాటు కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇంటింటి ప్రచారానికి చంద్రబాబు – లోకేశ్ మార్గదర్శకత

ఇంటింటి ప్రచారంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రైతు సంక్షేమం, విద్యారంగ పునరుద్ధరణ, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించనున్నారు. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే దానిపై పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీడీపీ కమిటీలు, కొత్త కార్యవర్గం ఇతర అంశాలపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

ప్రచారం క్రమంగా – మండల స్థాయిలో సమన్వయం

జూలై 2 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి ప్రచారం దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో పార్టీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు, యువజన నేతలు, మహిళా విభాగాలు క్రమపద్ధతిలో ఇంటింటి తిరుగుతూ ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు.

Read also: Andhra pradesh: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

#AndhraPradesh #APPolitics #ChandrababuNaidu #IntintikiPracharam #NaraLokesh #TDPLeadership #TDPMeeting Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.