📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Chandrababu Naidu: ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పి కొట్టాలి

Author Icon By Rajitha
Updated: February 12, 2026 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్డీయె శాసనసభా పక్ష సమావేశంలో సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

విజయవాడ : ప్రత్యర్థుల పన్నాగాలను కూటమీ పక్షాలు సంఘటితంగా తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు (chandrababu naidu) అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి, విషయ అవగాహనతో రావాలని నిర్దేశించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ నమోదు చేసుకుంటానని చెప్పారు. 3 నుంచి 7నిమిషాల్లో స్పష్టంగా విషయం చెప్పాలని మార్గనిర్దేశం చేశారు. తనకు క్వాంటం పరిజ్ఞానం లేకపోయినా, దాని ప్రయోజనాలు బాగా తెలుసన్నారు. సాంకేతికత మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు. రాష్ట్రంలో 1.60 లక్షల మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం కొత్త టెక్నాలజీపై యువత ఆసక్తికి నిదర్శనమన్నారు. మద్రాస్ ఐఐటీలో క్వాంటం కోర్సుకు 2.5 లక్షల మంది దరఖాస్తులు వస్తే అందులో లక్షా 10 వేల మనవాళ్లవే ఉన్నట్లు గుర్తుచేశారు.

Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

Opponents’ plans must be thwarted

సర్కార్ వచ్చాక లక్ష కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారుల పనులు, రూ.90 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలన్నింటినీ రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నారు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్ల నష్టంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నింటినీ అధిగమించి రూ.54 కోట్ల లాభల్లోకి రావడం శుభపరిణామం అన్నారు. అన్నిమతాలను గౌరవించాలని, ఎవరి విశ్వాసాలను దెబ్బతీయకూడదని సీఎం స్పష్టంచేశారు. జగన్ కు మతాలపై గౌరవం లేనందునే వైఎస్సార్సీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగిన విషయం ప్రస్తావించారు. తిరుమల సహా వీలైన ప్రతి ఆలయంలో ప్రసాదాలను కల్తీ చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో లేకపోతే ఫలితాలు రావు విశ్వాసం పెంచుకుని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేలా కూటమి ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దు.

ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి

కానీ వ్యవస్థలను గాడిన పెట్టామని తెలిపారు. దీన్ని అంతా సానుకూలంగా తీసుకుని కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తించి తనకు ఇస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో లేకపోతే ఫలితాలు రావని అన్నారు. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందని అన్నారు. కేంద్రం అమరావతి, పోలవరానికి నిధులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదని తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కారణం కేంద్ర సాయమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సాయంతో నిలబెట్టామన్నారు. కేంద్ర సాయంతో మొదటి సారి రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించింది. 20 నెలలుగా కొనసాగుతున్న కూటమి ఐక్యతను కాపాడుకోవాలని కిందిస్థాయిలోనూ ఇదే ఐక్యత ఉండాలని అన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ, అందరం ఒక్కటే అనే భావనతో మెలిగేలా చూసుకోవాలి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly Chandrababu Naidu latest news NDA Meeting Polavaram Project Quantum Courses Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.