📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Chandrababu Naidu: కుప్పానికి ‘సుర్బానా‘చే మాస్టర్ ప్లాన్

Author Icon By Saritha
Updated: October 22, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మున్సి పాలిటీని దేశంలోనే ఓ మోడల్ మున్సిపాలిటీగా (Chandrababu Naidu) మార్చుతామని ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో కుప్పం పట్టణాన్ని ఓ సుందర పట్టణంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు సింగపూర్ దేశంకు చెందిన ప్రముఖ సంస్థ ‘సుర్బానా జురాంగ్'(Surbana Jurong) ముందుకు వచ్చింది. ఈ సంస్థ మున్సిపాలిటీ అభివృద్ధికి తగు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇటీవలే సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధుల బృందం కుప్పంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ తో కలసి పట్టణాన్ని పరిశీలించింది. సుర్బానా సంస్థ నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అనుగుణంగా వారు నివశించే ప్రాంతాలను పర్యావరణ సంహితంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ సంస్థ సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, హాంకాంగ్, యుకె, యుఎస్ఎ, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో వివిధ నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంతో పాటు ఫ్యూచర్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యం వహించింది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణ అభివృద్ధికి సుర్బానా సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది.

Read also: భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

Chandrababu Naidu: కుప్పానికి ‘సుర్బానా‘చే మాస్టర్ ప్లాన్

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక

పట్టణ సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, పట్టణంలో 12 సర్కిళ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నారు. వీటితో పాటు పట్టణంలో మాల్ స్ట్రీట్ ఏర్పాటుకు కూడా ఈ ప్లాన్లో చర్యలు పట్టణ సుందరీకరణ, రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ ఇప్పటికే రూ.92 కోట్ల నిధులు మంజూరు చేపట్టనున్నట్లు సమాచారం. పట్టణ జనాభా సుమారు 40-45వేలు ఉండగా భవిష్యత్తులో జనాభా పెరుగుదల, ఇతర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాన్ని ఓ సమగ్ర ప్లాన్తో అభివృద్ధి చేసేలా ఈసంస్థ డిజైన్ చేయనుంది. తద్వారా కుప్పం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కీలకం కానుంది. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి సిఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) దాదాపు 92.20 కోట్ల రూపాయల నిధులు ఇదివరకే మంజూరు చేశారు. ఈనిధులతో సుమారు రూ.22 కోట్లతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.3 కోట్లతో ఎల్పిజి బర్నింగ్ యూనిట్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే పట్టణంలోని సెంట్రల్ పార్క్ రూ.10 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే డికెపల్లి పార్క్, రోడ్ల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. కుప్పంలో రూ.70 కోట్లతో అత్యాధునిక బసెస్టేషన్ నిర్మాణం సైతం అతి త్వరలో జరగనుంది. మున్ముందు సిఎం చొరవతో ఓ కొత్త కుప్పాన్ని చూస్తామనడం అతిశయోక్తి కాదు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Andhra Pradesh Chandrababu Naidu Kuppam development Kuppam Master Plan Latest News in Telugu Municipality Projects Surbana Jurong Telugu News Town Planning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.