📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Chandrababu Naidu: నీళ్ల లెక్కలు త్వరలో అన్నీ బయటపెడతా!

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యం

విజయవాడ :నీటి పంపకాల అంశానికి సంబంధించి అన్ని విషయాలను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి, వివరంగా మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల నిర్వహణలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. నీటి పంపకాల (లిఫ్ట్ ఇరిగేషన్) అంశంపై త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తన విన్నపం మేరకు ఆజ్ఞాపించినట్టు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read also: Telugu States: నేడు సుప్రీంకోర్టులో జల వివాదాల కేసు విచారణ?

will reveal all the details about the water calculations soon

రాయల సీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు 2020లోనే ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే సంబంధిత పనులు ఆగాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల (krishna river) పంపకం వివాదం నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్రం లో నీటి వనరుల నిర్వహణ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి (రాయలసీమ లిఫ్ట్, పట్టిసీమ వంటివి)కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. పోలవరం, వెలిగొండ వంటి మేజర్ ప్రాజెక్టులతో పాటు ఈ నీటి పంపకాలు ఏపీ రైతులకు కీలకం. చంద్రబాబు త్వరలో వివరణ ఇవ్వనుండడంతో ఈ అంశం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandrababu Naidu Krishna River latest news Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.