చిత్తూరు (chittor) జిల్లాలోని మామిడి రైతులకు సుమారు 540 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ చెల్లించబడలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా (Roja) తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ ముగిసిన నాలుగు నెలలు గడిచినప్పటికీ, రైతుల అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా చేరలేదని ఆమె ఆరోపించారు. రాజా ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu Naidu ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, తర్వాత అవి అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా, జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ హామీ ఇవ్వబడినట్లు, రైతులను తప్పుదారిలో నడిపించేందుకు ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు.
Visakhapatnam: నారా లోకేశ్ ప్రారంభించిన కొత్త డేటా సెంటర్..

Chandrababu Naidu
రోజా తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 30,000 మంది రైతులు దాదాపు 4.5 లక్షల టన్నుల తోటాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. ఫ్యాక్టరీల వాటా రూ.360 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.180 కోట్లు కలిపి మొత్తం రూ.540 కోట్లు చెల్లించాల్సి ఉంది. Chandrababu Naidu అయినప్పటికీ, ఇప్పటివరకు ఒక రూపాయి కూడా చెల్లించబడలేదు. రైతులు (formers) తమ సమస్యను చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం కూడా ఆగ్రహానికి కారణమని రోజా పేర్కొన్నారు.
“మామిడి రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలి. వారి పోరాటానికి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని” రోజా చివరగా స్పష్టం చేశారు.
రోజా ఏ విషయం మీద ఆవేదన వ్యక్తం చేశారు?
చిత్తూరు మామిడి రైతులకు సుమారు రూ.540 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు బకాయిలు ఎందుకు ఇవ్వలేదు అని రోజా విమర్శించారు?
జగన్ పర్యటనను దృష్టిలో పెట్టి చంద్రబాబు హామీ ఇచ్చి, అమలు చేయకపోవడం కారణంగా రైతులు నిరాశలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: