విజయవాడ: దసరా ఉత్సవాల(Dussehra celebrations) సందర్భంగా శ్రీకనక దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారి కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈఓ శీనా నాయక్తో కలిసి ఆయన ఆదివారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, ఈరోజు (సోమవారం) రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఈఓ శీనా నాయక్ తెలిపారు.
Read Also: Asia Cup 2025: తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రశంసలు
దర్శన వేళలు, అదనపు ఏర్పాట్లు
మూల నక్షత్రం(parent star) రోజున దర్శనం కోసం ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటల వరకే భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత క్యూలైన్లో నిలబడే భక్తులు రేపు ఉదయం సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటారు. పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో అదనంగా ఏపీఎస్పీ ప్లాటూన్లను రప్పిస్తున్నామని, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచుతున్నామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొత్తం భక్తులలో వీఐపీల సంఖ్య రెండు శాతం మాత్రమేనని, సోమవారం వీఐపీ పాసులు జారీ చేయడం లేదని చెప్పారు. అలాగే, భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా రేపు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ రద్దీకి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు కూడా కారణం కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
కృష్ణా నదికి హెచ్చరిక, సీఎం పట్టువస్త్రాలు
కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందని, రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, స్నానానికి నదిలో దిగడం వంటివి చేయవద్దని సూచించారు. సోమవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈఓ శీనా నాయక్ తెలిపారు. కుంకుమార్చన, శ్రీ చక్ర నవార్చన వంటి ప్రత్యేక పూజలు చేయించుకునేవారి కోసం భవాని ఘాట్, గాంధీ మ్యూజియం నుంచి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని, ఉదయం 7 నుంచి 8 మధ్య ఆ వాహనాలలోనే దేవస్థానానికి రావాలని కోరారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు.
మూల నక్షత్రం రోజున దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనం ఇస్తారు?
శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
ఈరోజు (సోమవారం) ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది?
సుమారు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: