📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్

Author Icon By Vanipushpa
Updated: January 28, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీకి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పలు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఇబ్బందులు మొదలయ్యాయి.తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఏబీకి వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. కోర్టులో ఊరట లభించినా తిరిగి సస్పెండ్ చేసింది. దీంతో సస్పెన్షన్ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన జీత భత్యాల్ని కూడా నిలిపేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది. అయినా వీటిని చెల్లించకుండా ఆలస్యం చేశారు.

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో జరిగిన తప్పిదాలను సవరించడం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనపై గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాల్ని కూటమి సర్కార్ ఉపసంహరించుకుంది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండుసార్లు సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు అప్పట్లో సస్పెన్షన్ కాలంలో బకాయి ఉన్న జీత భత్యాల్ని చెల్లించబోతున్నారు.

AB Venkateswara Rao Andhra Pradesh chandra babu naidu good news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.