हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Banakacharla Project : తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించిన చంద్రబాబు

Sudheer
Banakacharla Project : తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (chandrababu) రాష్ట్రాల్లో నీటి వనరుల వినియోగంపై తలెత్తుతున్న వివాదాలపై స్పందించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై తెలంగాణ రాష్ట్రం (Telangana) అభ్యంతరం చెప్పడాన్ని తప్పుబట్టారు. “నీరు సముద్రంలో కలిసిపోయే ముందు వాడుకోవడంలో తప్పేంటి? రెండు తెలుగు రాష్ట్రాలు నీటి కోసం కుదిపిపడితే చివరకు ఎవరికీ లాభం ఉండదు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీటిని పరస్పర అవగాహనతో వినియోగించుకోవాలన్నది ఆయన దృష్టికోణం.

గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలింపు చట్టబద్ధమే

చంద్రబాబు స్పష్టం చేసినది ఏమంటే, ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి కొరత కారణంగా గోదావరి నుంచి నీటిని తరలించాల్సిన అవసరం తలెత్తిందని అన్నారు. పోలవరం మినహా గోదావరి నదిపై ఉన్న చాలా ప్రాజెక్టులకు అధికారిక అనుమతులు లేవన్న సంగతి కూడా ఆయన గుర్తు చేశారు. అయితే కొత్త ట్రైబ్యునల్ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన వాటా మేరకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన వివరించారు.

ఒకరికొకరు సహకరించుకుంటేనే అభివృద్ధి

రాష్ట్రాల మధ్య శాంతియుతంగా, సహకార దృక్పథంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అవసరమైతే ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర స్థాయిలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. “ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఇద్దరమూ కలసి అభివృద్ధికి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది” అని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వంటి నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సంయమనం పాటించి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలనే పిలుపునిచ్చారు.

Read Also : Yogandhra 2025 : 22 వరల్డ్ రికార్డుల లక్ష్యంగా యోగాంధ్ర – చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870