हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Chandrababu: భారత్ విలువైన ప్రాచీన విజ్ఞానానికి నిలయం

Tejaswini Y
Chandrababu: భారత్ విలువైన ప్రాచీన విజ్ఞానానికి నిలయం

Bharatiya Vignan Sammelan: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) దేశానికి ఉన్న ప్రాచీన వైభవం, విజ్ఞాన సంపదను గుర్తు చేశారు. ఈ వేదికపై మాట్లాడుతూ భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. భారతీయతపై చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

Read also: YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

ప్రాచీన కాలంలోనే భారత్ విజ్ఞానానికి నిలయంగా ఎదిగిందని చంద్రబాబు తెలిపారు. వేలేళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా పట్టణ వ్యవస్థల ప్రణాళికను ప్రపంచానికి చూపిందని చెప్పారు. అలాగే, సుమారు 2900 ఏళ్ల క్రితమే యోగ సాధన ప్రారంభమైందని, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) కృషితో ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో యోగా విస్తరించిందని గుర్తు చేశారు. 2600 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ద్వారా వైద్య విధానాలు అమలులోకి వచ్చాయని ఆయన వివరించారు.

Bharatiya Vignan Sammelan
Chandrababu: India is the home of valuable ancient knowledge

తక్షశిల, నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి విద్యను అందించిన ఘనత కూడా భారతదేశానిదేనని చంద్రబాబు అన్నారు. సున్నా ఆవిష్కరణ, మేధస్సును పెంపొందించే చదరంగం ఆవిర్భావం కూడా భారతీయుల తెలివితేటలకు నిదర్శనమన్నారు.

ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట(Aryabhatta), గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావులు భారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతీకలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించిన మహనీయులతో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870