Chandrababu: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్‌: సీఎం కీలక ఆదేశాలు

Read Time:  1 min
Chandrababu
Chandrababu
FONT SIZE
GET APP

AP Government: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధికారులు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అవసరమైతే బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసేలా చూడాలని తెలిపారు.

Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

Chandrababu: Government services will be fully digital: CM’s key instructions

క్రెడిట్ రేటింగ్ ఆధారంగా తక్కువ వడ్డీ రుణాలు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సంక్షేమ–అభివృద్ధి నిధులను సమర్థంగా వినియోగించేందుకు కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ఇకపై కొరియర్ ద్వారా పంపే అవకాశాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కంపెనీల క్రెడిట్ రేటింగ్(Credit rating) ఆధారంగా తక్కువ వడ్డీ రుణాలు లభిస్తాయని వివరించారు.

సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని, కేంద్ర–రాష్ట్ర డేటాలను ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో సమీకరించామని చెప్పారు. అవేర్ యాప్ ద్వారా రియల్ టైం డేటా ప్రభుత్వానికి చేరుతోందని వెల్లడించారు.

టెక్నాలజీ–గ్రీన్ ఎనర్జీలో ఏపీ ముందంజ

టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలలో ఏపీ ముందంజలో ఉందని, మైక్రోసాఫ్ట్ భారత్‌లో రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.