విజయవాడ : అంతర్జాతీయ వేదికపై కొనేరు హంపి మరింత ప్రకాశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu), మంత్రి నారా లోకేష్ (Lokesh) ఆకాంక్షించారు. ఫీడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ (FIDE World Cup Semifinals) కు చేరిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన రికార్టు సాధించారని అభినందించారు. హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయ చెస్కు గర్వకారణమైన క్షణం అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు సూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. టైటిల్ను ఇంటికి తీసుకురావాలని కోరారు. అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచిన ఆమె… ఇప్పుడు ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
చంద్రబాబు నాయుడు చరిత్ర?
నాయుడు 1989 నుండి 1995 వరకు టిడిపి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) పనిచేశారు. 1995 లో, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా గతంలో రెండు పర్యాయాలు పనిచేసిన కాలంలో, నాయుడు ప్రజలలో ఒక దార్శనిక ఆర్థిక సంస్కర్త మరియు సమాచార సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి ప్రతిపాదకుడిగా గుర్తింపు పొందారు.
చంద్రబాబు నాయుడు బిజినెస్?
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (HFL), ఒక పాడి పరిశ్రమ సంస్థను నాయుడు 1992లో స్థాపించారు. ఈ కంపెనీ 1994లో పబ్లిక్ ఇష్యూలోకి వచ్చింది.
చంద్రబాబు నాయుడు పథకాలు?
నాయుడు మూడవ సారి కొత్తగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తౌఫా, చంద్రన్న కాపు భవన్ చంద్రన్న పెళ్లి కానుక మొదలైన మొత్తం 21 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Amaravati : అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన!