ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల హక్కుల పరిరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ల అంశాన్ని ఆయన ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో రద్దైన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జీవో నెం.3 పునరుద్ధరణ పట్ల ప్రభుత్వ నిష్ట
2020లో న్యాయ సమీక్షలో రద్దైన జీవో నెం.3 మళ్లీ అమలులోకి రావాలన్న దిశగా చంద్రబాబు ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెం.3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులకు సీఎం ఆదేశాలు
సమీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు మూడు కీలక ఆదేశాలు జారీ చేశారు జీవో పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్ష సందర్భంగా జీవో నెం.3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. జీవో నెం.3ను పునరుద్ధరించాలన్నది మా ఎన్నికల హామీ. ఇది న్యాయమైనదే కాదు, సమాజ న్యాయానికి మార్గదర్శకమవుతుంది, అని తెలిపారు.
Read also: Janasena : పవన్ చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది – నాగబాబు