📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: Chandrababu: రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు

Author Icon By Rajitha
Updated: November 12, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

17నెలల్లో ఇళ్లు పూర్తిచేసి లబ్దిదారులకు… ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం : ఎన్నికల మ్యానిఫెస్టో అమల్లో బాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తుంది. అందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంతిల్లు లేని లేని పేదలకు ఇళ్ళు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హమీ ఇచ్చారు. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోనికి వచ్చిన 17నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 3 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ళలో ఒకేమారు లబ్దిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N.Chandrababu Naidu) చేతుల మీదుగా 3లక్షల ఇళ్ళల్లో లబ్ధిదారుల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ళను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

Read also: YS Jagan: ఈ నెల 21వ తేదీలోగా కోర్టు లో హాజరుకానున్న జగన్?

Chandrababu: రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు

ఉచిత ఇసుక విధానంతో

లబ్దిదారులకు ఇంటి అందించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బిఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్ళు, పిఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్ళు, పిఎంఎవై జన్మన్ పధకం కింద మరో 6,866 ఇళ్ళలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. మొత్తంగా 3,00,192 ఇళ్ళకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. 2014తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసింది.

3 లక్షల ఇళ్ళ ప్రారంభోత్సవ

ప్రస్తుతం అధికారంలోనికి వచ్చిన 17నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గత పాలకులు పేదల సొంతింటి కలల్ని కూల్చేసింది. 4.73 లక్షల ఇళ్ళు రద్దు చేసింది. 2.73 లక్షల మంది లబ్దిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టింది. గత ప్రభుత్వం నిలిపేసిన ఇళ్ళ నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్ళనే కాకుండా.. మరిన్ని ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3లక్షల ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh ChandrababuNaidu HousingScheme latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.