నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘చలో జువ్వలదిన్నె’ కార్యక్రమానికి భారీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ హార్బర్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర చేస్తోందని, దీనివల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read also: Kerala Assembly Elections: కేరళ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

YSRCP: YSRCP Sets Foot Towards Juvvaladinne
ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టనున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకగా నిర్మించిన ఈ హార్బర్ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని నేతలు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: