📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Chairman Sarath Chandra-తెలుగు, సంస్కృత అకాడమీ ద్వారా భాషా వికాసానికి కృషి

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : తెలుగు, సంస్కృత అకాడమీ ద్వారా భాషా వికాసానికి కృషి చేస్తానని ఆ అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర ఆర్డీ విల్సన్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సంపాదకులు, రచయితలు, భాషాభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం(Spiritual gathering program) మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో సమాజ సంస్కర్త శరత్ చంద్రను పలువురు ప్రశంసించారు. సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ఆయన, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టారని, తన రచనల ద్వారా సమాజంలో గళమెత్తారని గుర్తుచేశారు.

సాహిత్యంపై ఆర్డీ విల్సన్ అభిప్రాయం

ఆర్డీ విల్సన్ మాట్లాడుతూ, తెలుగు భాషపై తనకున్న మక్కువ కారణంగా వైద్య రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ, తాను మాత్రం సాహిత్యాన్ని ఎంచుకున్నానని తెలిపారు. నవలలు, కథలు, నాటకాల ద్వారా సమాజ అభివృద్ధికి దోహదం చేశానని చెప్పారు. అలాగే సమకాలిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జర్నలిస్టుగా కూడా పనిచేశానని గుర్తుచేశారు.

రాబోయే రోజుల్లో తెలుగు భాష ఎన్నో సవాళ్లు ఎదుర్కోనుందని, కానీ భాష యొక్క సౌందర్యం మాట్లాడటంలో, సాహిత్యం చదవడంలోనే ఇమిడి ఉందని చెప్పారు. కులం, మతానికి భాషను ఆపాదించవద్దని సూచించారు. సాహిత్యం నడుస్తున్న చరిత్రకు సాక్షి కాబట్టి దానిని కనుమరుగవ్వకుండా పరిరక్షించుకోవాలని సూచించారు.

అకాడమీ సేవలు మరియు భవిష్యత్ లక్ష్యాలు

తెలుగు మరియు సంస్కృత అకాడమీలో(Sanskrit Academy) పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, విద్యార్థులకు మరిన్ని సేవలు అందించే చర్యలు తీసుకుంటామని ఆర్డీ విల్సన్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మరియు ఇతరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫోన్ ద్వారా ఆర్డీ విల్సన్‌ను అభినందించారు.

తెలుగు, సంస్కృత అకాడమీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
భాషా వికాసం, సాహిత్య పరిరక్షణ మరియు విద్యార్థులకు సేవలు అందించడం ప్రధాన లక్ష్యం.

ఆర్డీ విల్సన్ ఏ రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ సాహిత్యాన్ని ఎంచుకున్నారు?
ఆయనకు వైద్య రంగంలో అవకాశాలు ఉన్నప్పటికీ, సాహిత్యాన్నే ఎంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sai-prasad-polavaram-project-to-be-completed-by-december-2027/breaking-news/548703/

Latest News in Telugu RD Wilson Sharath Chandra Telugu Language Development Telugu Literature Telugu News Today Telugu Sanskrit Academy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.