తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ముదిరాయి. తాజాగా కూటమి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్పై మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిషన్ను నియమించడంపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినట్లుగా సీబీఐ విచారణ జరగలేదని, అందుకే తనకి అనుకూలమైన నివేదిక కోసమే ఈ కమిషన్ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగమే తప్ప, వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం కాదని భూమన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Trump reaction obama : ఒబామా ఏలియన్ల వ్యాఖ్యలు కలకలం, రహస్యాలు వెలిబుచ్చారన్న ట్రంప్
ఈ విచారణ ప్రక్రియపై భూమన మరిన్ని ప్రశ్నలు సంధించారు. గతంలో ఈ వ్యవహారంపై సీబీఐకి రాసిన లేఖలు, వారు ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న తరుణంలో, ఇలాంటి కమిషన్లను నియమించడం అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే సీబీఐ విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా, ఈ ఏకసభ్య కమిషన్ నియామకాన్ని భూమన ఎద్దేవా చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమిషన్కు ఛైర్మన్గా రిటైర్డ్ అధికారి ఎందుకు, స్వయంగా చంద్రబాబు నాయుడే ఆ పదవిలో ఉంటే సరిపోయేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తనకు నచ్చినట్లుగా విచారణ జరిపించుకుని, తనే తీర్పు ఇచ్చుకోవడానికి ఇది ఒక మార్గమని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ, రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను రచ్చకీడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com