ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (AP Govt) ఏర్పడి ఒక సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పిలుపునిచ్చారు. పిఠాపురంలోని జనసేన (Janasena) నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న “సుపరిపాలనకు ఏడాది” అనే నినాదంతో గ్రాండ్ గా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈరోజున సంక్రాంతి, దీపావళిలా కలిసి పండుగలా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మహిళలు ముగ్గులు
ఈ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసి, కూటమి విజయాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే రాత్రివేళ దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి సంఘీభావాన్ని వ్యక్తం చేయాలన్నారు. కూటమి పాలనలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసే విధంగా ఈ వేడుకలు ఉండాలని ఆయన వివరించారు.
సోషల్ మీడియా లో షేర్
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) షేర్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన విధానాలను ప్రజల ముందు చూపించేందుకు మంచి అవకాశమని తెలిపారు. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి జరగాలన్నదే మన ఆశయం అని మనోహర్ స్పష్టం చేశారు.
Read Also : Egg: గుడ్డు మాంసాహారమా? శాఖాహారమా? – సైన్స్ ఏం చెబుతుందంటే?