Bhumana Karunakar Reddy : భూమనపై కేసులు నమోదు చేస్తాం – హోంమంత్రి అనిత

Read Time:  1 min
Anita: భూమనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మంత్రి వంగలపూడి అనిత
Anita: భూమనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మంత్రి వంగలపూడి అనిత
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ వారు మతకలహాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారని, అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి‌పై కేసులు నమోదు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం

గతంలో పింక్ డైమండ్ ఉందని తప్పుడు ప్రచారం చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు తిరిగి టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పవిత్రమైన దేవస్థానాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.

Bhumana Karunakar Reddy: మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన భూమన

పవిత్ర దేవస్థానాల పరువు నిలబెట్టడం అందరి బాధ్యత

టీటీడీ విధానాలను కాలంచేసేలా, దేవస్థానాలపై ప్రజల్లో అనవసర సందేహాలు కలిగించేలా వ్యాఖ్యానించడం క్షమించరాని పాపమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిరక్షణలో ఉన్న పవిత్ర దేవస్థానాల పరువు నిలబెట్టడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను అరికట్టేందుకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.