ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్
విజయవాడ : 3 వ ప్రపంచ తెలుగు మహా సభలు 2026 (World Telugu Conference 2026) సన్నాహాలలో భాగంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో .. కార్టూన్ల ద్వారా తెలుగు వికాసం.. కార్టూన్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఏ వయసు వారైనా పాల్గొనవచ్చునన్నారు. పోటీల్లో విజేతలకు 5116/, ప్రథమ బహుమతి 3116/, తృతీయ బహుమతి 2116/, ప్రత్యేక బహుమతులు (Special gifts) ఒక్కొకరికి 516/ప్రశంసా పత్రాలు అందజేయబడతాయని తెలిపారు. ఒక్కొక్కరు రెండు కార్టూన్స్ పంపవచ్చు.కార్టూన్స్ ఏ4 సైజ్ లో వుండాలని,
నిర్వాహకులకు అందాలని
ఇంతకు ముందు ప్రచురితమైనవి పంపరాదని డా.శ్రీనివాస్ కోరారు. కార్టూన్స్ అక్టోబర్ 10 వ తారీఖు లోపున నిర్వాహకులకు అందాలని. విజేతలను (The winners) అక్టోబర్ 29 వ తారీఖున ప్రకటిస్తామని తెలిపారు. విజేతలకు తెలుగు మహాసభల్లో బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఎంపిక అయిన కార్టూన్లను 3 వ ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రత్యేక వేదికపైన ప్రదర్శిస్తామని,
కార్టూన్స్ పంపవలసిన ఈమెయిల్, వాట్సాప్ నెంబర్ .9866084124. ఈ పోటీలకు సమన్వయకర్తగా ప్రముఖ కార్టూనిస్ట్ బి.హరి వెంకట రమణ వ్యవహరిస్తారని సంస్థ కార్యదర్శి ధవేజీ, ముఖ్య సమన్వయ కర్త పి. రామచంద్రరాజు సహ సమన్వయ కర్త వాసిరెడ్డి విద్యా సాగర్ , తెలుగు మహాసభలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: