ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) సంస్కృత విభాగంలో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతిపై పలువురు విద్యార్థినులు లైంగిక వేధింపుల(Campus Controversy) ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని వారు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also: HYD Crime: అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు మృతి
ఫిర్యాదులో తరగతి గదిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగతంగా తన గదికి రావాలని ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థినులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన క్యాంపస్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
విశ్వవిద్యాలయ వర్గాల ప్రకారం, గతంలో కూడా ఇదే ప్రొఫెసర్పై ఇలాంటి ఆరోపణలు(Campus Controversy) వెలుగుచూశాయని, ఒక కేసు కూడా నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థినుల భద్రత, గౌరవం, రక్షణపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటారని విద్యార్థులు ఆశిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: