Bypoll : ఈరోజు ఏపీలో 28 స్థానిక సంస్థల్లో ఉపఎన్నికలు

Read Time:  1 min
Counting of MLC votes in Telangana.. BJP in the lead
Counting of MLC votes in Telangana.. BJP in the lead
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 28 స్థానిక సంస్థల పదవులకు ఈరోజు ఉపఎన్నికలు (Bypoll) జరుగనున్నాయి. వీటిలో యలమంచిలి, అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, కారంపూడి, అత్తిలి, దగదర్తి మండలాల్లో వైస్ ఎంపీపీ పదవులు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు

విశాఖపట్నం కార్పొరేషన్‌లో (GVMC) డిప్యూటీ మేయర్ పదవి, బొబ్బిలి, ఆదోని, కదిరి మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ పదవులు కూడా ఖాళీగా ఉండటంతో ఇవాళ ఓటింగ్ నిర్వహించనున్నారు. తిరువూరు నగర పంచాయతీతో పాటు కదిరి మున్సిపాలిటీలో మరో రెండు వైస్ ఛైర్‌పర్సన్ పదవులకూ ఎన్నికలు జరుగుతాయి. అధికార పార్టీ, విపక్షాలు ఈ ఉపఎన్నికలలో గెలుపుకోసం తీవ్రంగా ప్రచారం నిర్వహించాయి.

భద్రతా ఏర్పాట్లు పటిష్టం

ఈ ఎన్నికల నేపథ్యంలో స్థానిక అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, శాంతియుతంగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాక ఫలితాలు త్వరితగతిన ప్రకటించేలా ఏర్పాట్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఉపఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Dr. Mark E. Rupp : కొత్త వ్యాక్సిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ : కరోనా

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.