తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. రోడ్లపై ప్రయాణమంటేనే ప్రాణాలను పణంగా పెట్టినట్టే పరిస్థితి ఏర్పడింది. హైవేల్లో బస్సులు బోల్తా పడటం, కాలిపోవడం, లోయల్లోకి దూసుకెళ్లడం వంటి ఘటనలు అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టేశాయి. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూలు శివారులో జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చను రేకెత్తించింది.
Read also: California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్ డ్రైవర్ అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ప్రధాన ప్రమాదాలు
గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కొన్ని బస్సు ప్రమాదాలు:
- 2010 (అనంతపురం): ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా, 18 మంది మృతి.
- 2012 (కృష్ణా): బస్సు చెరువులో పడటంతో 22 మంది మరణం.
- 2013 (పాలెం, మహబూబ్నగర్): వోల్వో బస్సు మంటల్లో కాలిపోవడంతో 45 మంది సజీవదహనం.
- 2014 (మెదక్): స్కూల్ బస్సు-రైలు ఢీ, 26 మంది విద్యార్థుల దుర్మరణం.
- 2015 (ఖమ్మం): విద్యార్థులతో ఉన్న బస్సు బోల్తా, 13 మంది మృతి.
- 2017: ఏపీఎస్ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 2018 (కొండగట్టు): 57 మంది భక్తుల మరణంతో చరిత్రలోనే పెద్ద ప్రమాదం.
- 2019: శ్రీశైలానికి వెళ్తున్న భక్తుల బస్సు లోయలో పడటంతో 9 మంది మృతి.
- 2019 (కర్నూలు): వోల్వో-తుఫాన్ ఢీ, 15 మంది మృతి.
- 2021 (ఏలూరు): బస్సు వాగులో పడటంతో 9 మంది మృతి.
- 2025 (కర్నూలు): వోల్వో బస్సు మంటల్లో చిక్కుకుని 20 మందికి పైగా సజీవదహనం.
భవిష్యత్ భద్రతా చర్యల అవసరం
ప్రతి ఘటన తర్వాత విచారణలు జరుగుతున్నప్పటికీ, ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. నిపుణులు డ్రైవర్లకు తగిన శిక్షణ, రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదల, వాహనాల టెక్నికల్ చెక్లను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్డు భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం ఏది?
2013లో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు అగ్నిప్రమాదం – 45 మంది సజీవదహనం.
ఇటీవల జరిగిన ప్రమాదం ఎక్కడ జరిగింది?
2025లో కర్నూలు జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం జరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: