📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Breaking News:Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు

Author Icon By Pooja
Updated: November 3, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella Bus Accident) సమీపంలోని మీర్జాపూర్ గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కంకరతో నిండిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

read also: Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Chevella Bus Accident

నేతల సంతాపం వెల్లువ

ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “చేవెళ్ల వద్ద(Chevella Bus Accident) జరిగిన ఈ ప్రమాదం హృదయవిదారకం. 24మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని ఆయన తెలిపారు. అలాగే నారా లోకేష్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం మనసును కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని అన్నారు.

ప్ర‌మాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, డ్రైవర్ నిర్లక్ష్యమా లేక వాహనాల సాంకేతిక లోపమా అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు తక్షణ సహాయక చర్యలు తీసుకుంటుండగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu RangaReddyAccident RoadAccident TelanganaNews Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.