
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella Bus Accident) సమీపంలోని మీర్జాపూర్ గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కంకరతో నిండిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
read also: Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నేతల సంతాపం వెల్లువ
ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “చేవెళ్ల వద్ద(Chevella Bus Accident) జరిగిన ఈ ప్రమాదం హృదయవిదారకం. 24మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని ఆయన తెలిపారు. అలాగే నారా లోకేష్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం మనసును కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని అన్నారు.
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, డ్రైవర్ నిర్లక్ష్యమా లేక వాహనాల సాంకేతిక లోపమా అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు తక్షణ సహాయక చర్యలు తీసుకుంటుండగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: